కూకట్ పల్లిలో ట్యాంకర్​ నుంచి డీజిల్​ నింపుతుండగా ఫైర్..రెండు వెహికల్స్ దగ్ధం

 కూకట్ పల్లిలో ట్యాంకర్​ నుంచి డీజిల్​ నింపుతుండగా ఫైర్..రెండు వెహికల్స్ దగ్ధం

 కూకట్​పల్లి, వెలుగు: కూకట్ పల్లిలో ట్యాంకర్​నుంచి ప్రైవేట్​ట్రావెల్స్​బస్సులోకి డీజిల్​నింపుతుండగా మంటలు చెలరేగాయి. ట్యాంకర్ తోపాటు సమీపంలోని కారు దగ్ధమైంది. కూకట్​పల్లి ఐడీఎల్​చెరువు కట్ట కింద కావేరి ట్రావెల్స్​కు పార్కింగ్ స్థలం ఉంది. అందులో వారి బస్సులను పార్క్ చేస్తుంటారు. ప్రతిరోజూ ప్రత్యేకంగా ఒక డీజిల్​ట్యాంకర్ వచ్చి బస్సుల్లో డీజిల్​నింపి వెళ్తుంది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు డీజిల్​ట్యాంకర్​వచ్చి ఓ బస్సుల్లో డీజిల్​నింపుతుండగా మంటలు చెలరేగాయి.

ట్యాంకర్​తోపాటు కొంతకాలంగా అక్కడే పార్క్​చేసి ఉంచిన కారుకు మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే రెండూ దగ్ధమయ్యాయి. ఫైర్​సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బస్సు ఇంజిన్​ఆన్​చేసి ఉండడంతో వెంటనే ముందుకు తీసుకెళ్లి ఆపారు. బస్సు ఇంజిన్​ఆన్​లో ఉండడమే ప్రమాదానికి కారణం అని తెలిసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కూకట్​పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.